ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కొల్లు రవీంద్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం పై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ గతంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అచ్చెన్నాయుడు అరెస్టు సమయంలో నిబంధనలు ఉల్లంఘించారని అని ఆయనపై కేసు నమోదైంది. దీనికి సంబంధించి నారా లోకేష్ విచారణలో భాగంగా విజయవాడ కోర్టుకు వెళ్లగా ఆయనకు మద్దతుగా వచ్చిన కొల్లు రవీంద్ర ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశిస్తూ మేము మీ లాగా కేసులకు భయపడే వాళ్ళం కాదు కేసులను ధైర్యంగా ఎదుర్కొంటాం ఏవేవో విషయాలు చెప్పి కోర్టుల నుండి తప్పించుకోవడం మాకు అలవాటు లేదు ఏదైనా డైరెక్ట్ గా ఎదుర్కొంటాం అంటూ వ్యాఖ్యలు చేశారు. అయితే నారా లోకేష్ కు మద్దతుగా భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నేతలు మరియు కార్యకర్తలు విజయవాడ కోర్టుకు రావడం జరిగింది.