ఈ ఫేస్ ప్యాక్ తో తెల్లగా మెరిసే చర్మం మీసొంతం

     Written by : smtv Desk | Mon, May 23, 2022, 07:10 PM

ఈ ఫేస్ ప్యాక్ తో తెల్లగా మెరిసే చర్మం మీసొంతం

ప్రస్తుత ప్రపంచంలో ఒంటి రంగు అనేది చాలా ప్రాముఖ్యతని సంతరించుకుంది. తెల్లని మేనిచాయ మీసొంతం అయితే ఎంతో కానిఫిడేన్స్ ఉంటారు. నిజానికి అందమంటే రంగు కాదు మనసు కాని ఈ పోటీ ప్రపంచంలో పైపై మెరుగులకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. అయితే నలుపు రంగు పుట్టుకతో వచ్చిన లేక తర్వాత కాలంలో ఏ కారణంగానైనా వచ్చినా ఈ చిట్కాల్ని ప్రయోగించాలి.
* బక్కెట్ నిండా నీళ్లు తీసుకుని దాంట్లో రెండు నిమ్మకాయలు పిండాలి. ఆ రసం నీళ్ళలో బాగా కలిసాక ఆ నీళ్ళతో స్నానం చేయాలి. దీన్ని కొన్ని నెలల వరకు కొనసాగించాలి.
* మీగడలో పసుపు కలిపి రోజూ చర్మానికి రాయండి. పదినిమిషాల తర్వాత మెత్తగా, నెమ్మదిగా మసాజ్ చేయాలి.
* నిమ్మ, తులసి ఆకుల రసం సమపాళ్ళలో కలిపి రోజూ రెండుసార్లు ముఖానికి పట్టించండి.
* బంగాళాదుంపల రసం తీసి ముఖానికి రాసుకోండి. అరగంట వరకూ అలాగే ఉంచండి. వారానికి రెండు, మూడు సార్లు ఇలా చేయడం వల్ల తగ్గుతుంది.
* పచ్చిపాలలో పసుపు కలిపి దానిలో దూది పింజల్ని నాన బెట్టండి. తర్వాత ఆ పాలు ఫ్రిజ్లో ఉంచండి. రోజూ ఒక దూది పింజను తీసుకుని నల్లని చర్మం పై రుద్దుతూ చక్కగా శుభ్రం చేసుకుంటూ ఉండాలి. పచ్చిపాలు,పసుపు మిశ్రమం చర్మంలో నునుపు కలిగించడంతో పాటు నలుపు రంగు ను దూరం చేస్తుంది.
* శనగపిండి, నెయ్యి, పసుపు పేస్టులా తయారుచేసి చర్మంపై రాయాలి. కొద్దిగా ఆరాక చేత్తో మృదువుగా గుండ్రంగా మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మీ
పొడిబారిన చర్మం పై ఉన్న మరకలు తొలగిపోతాయి. దీనితో పాటు నలుపు తగ్గిపోయి ఛామన చాయతో కాంతి వంతంగా ఉంటుంది.
ప్రతి రోజూ చర్మానికి తేనె పూతగా రాయాలి.
* స్నానం చేయడానికి పది పదిహేను నిమిషాల ముందు శరీరానికి శనగపిండి, పచ్చిపాలు, పసుపు కలిపిన మిశ్రమాన్ని పట్టించాలి. ఆ తర్వాత స్నానం చేయాలి.





Untitled Document
Advertisements