బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డ దీదీ!

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 07:03 AM

బీజేపీ ప్రభుత్వంపై మండిపడ్డ దీదీ!

అందరిచేత దీదీ అని పిలవబడే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఎప్పుడు చూసిన ఇటు ప్రతిపక్షంపై అలాగే కేంద్రప్రభుత్వం పై తనదైన రీతిలో విరుచుకుపడుతూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంటారు. తాజాగా దీదీ బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. కేంద్ర దర్యాప్తు సంస్థలను వాడుకుంటూ కేంద్రం రాష్ట్రాల వ్యవహారాల్లో తల దూర్చుతోందని మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశ సమాఖ్య నిర్మాణాన్ని కూలదోస్తోందని విమర్శించారు.
కోల్ కతాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మమత మాట్లాడుతూ, అడాల్ఫ్ హిట్లర్, జోసెఫ్ స్టాలిన్, బెనిటో ముస్సోలిని వంటి నియంతలకన్నా బీజేపీ పాలన మరి దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు. దేశంలో తుగ్లక్ పాలన నడుస్తోందన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా కేంద్ర దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి కల్పించాలని స్పష్టం చేశారు. వాటిలో ఎలాంటి రాజకీయ జోక్యానికి తావులేని రీతిలో చర్యలు తీసుకోవాలని, నిష్పాక్షికతకు పెద్దపీట వేయాలని తెలిపారు. మరి దీదీ మాటలను కేంద్రంలోని పెద్దలు ఏ విధంగా తీసుకుంటారో చూడాలి.





Untitled Document
Advertisements