దేశవ్యాప్త పర్యటనలోనున్న కేసీఆర్ చర్చలు, భేటీలు రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 09:01 AM

దేశవ్యాప్త పర్యటనలోనున్న కేసీఆర్ చర్చలు, భేటీలు రద్దు చేసుకుని హైదరాబాద్ చేరుకున్నారు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఢిల్లీలో ఉన్న విషయం తెలిసిందే అయితే ఈ పర్యటన అర్ధంతరంగా ముగిసింది. నిన్న రాత్రి ఢిల్లీ నుంచి బయలుదేరిన కేసీఆర్ హైదరాబాద్ చేరుకున్నారు. దేశవ్యాప్త పర్యటనలో భాగంగా ఈ నెల 20న కేసీఆర్ ఢిల్లీ వెళ్లారు. 21న సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో భేటీ అయ్యారు. 22న ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో సమావేశమయ్యారు. అనంతరం ఇద్దరూ కలిసి చండీగఢ్ చేరుకున్నారు. రైతు ఉద్యమంలో ప్రాణాలు కోల్పోయిన 600 కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు రూ. 3 లక్షల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు. అక్కడి వరకు పర్యటన సజావుగానే సాగింది.
నిన్నటి వరకు అంతా బాగానే ఉంది ఉన్నట్టుండి ఏమైందో ఏమో తెలియదు కానీ నేడు, రేపు పలువురు ప్రముఖులతో జరగాల్సిన చర్చలు, భేటీలను రద్దు చేసుకుని అర్ధంతరంగా హైదరాబాద్ చేరుకున్నారు. కాగా, ఈ నెల 25న కేసీఆర్ బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, మాజీ సీఎం కుమారస్వామిలతో భేటీ అవుతారు. అలాగే, 27న మహారాష్ట్రలోని రాలెగావ్ సిద్ధి వెళ్లి అన్నాహజారేతో భేటీ అవుతారు. అదే రోజు షిరిడీ వెళ్లి సాయిబాబాను దర్శించుకుని తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మరి ఈ షెడ్యుల్ లో ఏమైనా మార్పులు ఉంటాయో లేదో కచ్చితంగా చెప్పలేం.





Untitled Document
Advertisements