మహిళ టీ టోర్నీలో సూపర్ నోవాస్ ఘనవిజయం..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 10:33 AM

మహిళ టీ టోర్నీలో సూపర్ నోవాస్ ఘనవిజయం..

ప్రపంచమంతా ఎంతో క్రేజ్ ను సంతరించుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ కొనసాగుతున్న తరుణంలో మహిళల ఐపీఎల్ గా పిలవబడే టీ చాలెంజ్ టోర్నీ సోమవారం మొదలైంది. అయితే ఈ టోర్నీలో మొదటి మ్యాచ్లో డిఫెండింగ్ చాంపియన్ ట్రయల్ బ్లెజర్స్ మరియు సూపర్ నోవాస్ తలపడగా.. డిఫెండింగ్ చాంపియన్ బ్లేజర్స్ కు సూపర్నోవాస్ షాక్ ఇచ్చింది. మహిళా టి చాలెంజ్ టోర్నీ చరిత్రలోనే అత్యధిక పరుగులు చేసి ట్రయల్ బ్లేజర్స్ జట్టును తక్కువ పరుగులకే కట్టడి చేసింది. మొదట బ్యాటింగ్ చేసిన సూపర్నోవాస్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 37 హర్వీన్ డియోల్ 35 డాటిన్ 32 పరుగులతో రాణించారు. ట్రయల్ బ్లేజర్స్ జట్టులో మ్యాథ్యూస్ మూడు మరియు సల్మాలు రెండు వికెట్లు తీసుకున్నారు. కాగా 20 ఓవర్ల కి సూపర్ నోవాస్ జట్టు 163 పరుగులు చేయగా చేజింగ్ కి వచ్చిన ట్రయల్ బ్లేజర్స్ జట్టు20 ఓవర్ల కి 114 పరుగులు చేసి 9 వికెట్లు కోల్పోయింది. బ్యాటింగ్లో కెప్టెన్ స్మృతి మందన 34 రొడ్రిగ్స్ 24 పరుగులతో మాత్రమే రాణించారు. ఇక సూపర్ నోవాస్ జట్టు బౌలర్ పూజ వస్త్రకర్ నాలుగు వికెట్లు తీసుకుని కేవలం 12 పరుగులు మాత్రమే ఇచ్చి ట్రయల్ బ్లేజర్ పతనాన్ని శాసించింది.





Untitled Document
Advertisements