ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ లో ఆఖరి వరకు పోరాడి భారతదేశానికి స్వర్ణాన్ని అందించిన తెలుగు తేజం నిఖత్ జరీన్ మీడియాతో జరిగిన సమావేశంలో ఆమెను కొన్ని ప్రశ్నలు అడగగా.. ఆమె తాను ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్ షిప్ ను సొంతం చేసుకోవడం పట్ల ఎంతో ఆనందంగా ఉందని ఈ ఛాంపియన్స్ కోసం తాను ఎన్నో కలలు కన్నాను అని తెలియజేశారు. అయితే ఇదే సమయంలో ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు చుక్కెదురైంది. ఇటీవల భారతదేశంలో చర్చనీయాంశంగా మారిన హిజాబ్ ఘటనకు సంబంధించి ఆమె ఎలాంటి వస్త్రధారణ అంటే ఇష్టం అని ప్రశ్నలు వేయగా .. దానికి నిఖత్ జరీన్ ఎవరు ఎలాంటి దుస్తులు వేసుకోవాలి అనేది అది తమ ఇష్టమని.. తారు అయితే హిజాబ్ ధరించడానికి ఇష్టపడతానని వెల్లడించారు. హిజాబ్ ధరించడం అనేది ఎవరి పర్సనల్గా ఎలా ఉంటుందో మనం చెప్పలేం కానీ నాకు పర్సనల్గా హిజాబ్ ధరించడం ఇష్టం అని చెప్పి అక్కడి నుండి తప్పించుకున్నారు. అయితే దేశంలో అల్లకల్లోలం సృష్టించిన హిజాబ్ ఘటనకు లింక్ చేస్తూ అడిగిన ఈ ప్రశ్నకు జరీన్ సులువుగా తప్పించుకుంది.