కేసీఆర్ పంజాబ్ పర్యటనపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 12:22 PM

కేసీఆర్ పంజాబ్ పర్యటనపై నిప్పులు చెరిగిన బండి సంజయ్

భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పంజాబ్ వెళ్లడం పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో రంగారెడ్డి జిల్లా బిజెపి నేతలతో సమావేశమైన బండి సంజయ్ తెలంగాణలో సమస్యలే లేవా అన్నట్లుగా పంజాబ్ వెళ్లారని విమర్శించారు. తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేసీఆర్ కు పంజాబ్ ఎలా వెళ్లాలి అనిపించిందని ధ్వజమెత్తారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదం విషయంలో 25 మంది విద్యార్థుల ప్రాణాలు ప్రభుత్వం తీసుకుందని తెలంగాణ రాకముందు విద్యార్థులు ఆర్టీసీ కార్మికులు మరి ఈ విధంగా ప్రాణాలు కోల్పో లేదని విమర్శలు చేశారు. తెలంగాణలో నిరుద్యోగ రేటు పెరిగిపోతుందని నిరుద్యోగులుగా మారుతున్న ఎందుకు యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇవన్నీ రాష్ట్రంలో సమస్యలే కానట్లు మన ముఖ్యమంత్రి పంజాబ్ వెళ్లి అక్కడి రైతులకు చెక్కుల పంపిణీ చేశారని మండిపడ్డారు.





Untitled Document
Advertisements