మృణాంక్ సింగ్ అనే క్రికెటర్ చేతిలో మోసపోయిన రిషబ్ పంత్..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 03:21 PM

మృణాంక్  సింగ్ అనే క్రికెటర్  చేతిలో మోసపోయిన రిషబ్ పంత్..

టీమిండియా ఆటగాడు రిషబ్ పంత్ అనుకోకుండా ఒక టికెట్ రేట్లు మోసపోయాడు. మృణాంక్ సింగ్ అనే ఒక ఆటగాడు సంవత్సరం క్రితం జోనల్ క్రికెట్ అకాడమీ లో రిషబ్ పంత్ పరిచయమయ్యాడు. రిషబ్ పంత్ దగ్గర ఉన్న ఖరీదైన వస్తువులను చూసి వాటిని ఎక్కువ ధరకు అమ్మి పెడతానని చెప్పి తన దగ్గర వస్తువులు మరియు దాదాపు కోటి వరకు నగదును అకౌంట్లో జమ చేయించాడని రిషబ్ పంత్ మరియు అతడి సెక్రెటరీ పోలీసులను ఆశ్రయించారు. రిషబ్ పంత్ కి ఒక కోటి 63 లక్షల రూపాయల చెక్కు ని మృణాంక్ సింగ్ అందచేశాడు . అయితే ఆ చెక్కు అకౌంట్లో డబ్బులు లేక బౌన్స్ అవ్వడంతో మృణాంక్ సింగ్ దగ్గరకు వెల్దామనుకునే లోపు అతడు మళ్లీ కనిపించలేదూ. రోజులు గడిచినా నెలలు గడిచినా ఇంకా తనకు డబ్బులు కాకపోవడంతో రిషబ్ పంత్ తాను మోసపోయానని గ్రహించి తన సెక్రటరీతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది అయినా ఒక స్థాయిలో ఉన్న ఎవరో తెలియని వ్యక్తితో ఇలా వ్యవహరించడం ఏమిటో ఎవరికీ అర్థం కావడం లేదు.





Untitled Document
Advertisements