రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లా రెడ్డిగా మారిన తెలంగాణా రాజకీయాలు

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 03:43 PM

రేవంత్ రెడ్డి వర్సెస్ మల్లా రెడ్డిగా మారిన తెలంగాణా రాజకీయాలు

తెలంగాణాలో రాజకీయాలు మళ్ళి జోరందుకున్న విషయం తెలిసిందే .. ఒకరి మీద ఒకరు ఎవరికీ వారు తగ్గకుండా వ్యాఖ్యలు చేసుకుంటూనే ఉన్నారు . ఈసారి తెలంగాణా కాంగ్రెస్ పార్టీ నాయకుడు టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మరియు తెలంగాణా మంత్రి మల్లా రెడ్డి మద్య మాటల యుద్ధం మొదలయ్యింది. అయితే మల్లారెడ్డి రేవంత్ దూషించగా రేవంత్ రెడ్డి మంత్రి మల్లారెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేసారు . రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ,మంత్రి అక్రమాల గురించి వివరిస్తూ .. "గుండ్లపోచంపల్లిలో మరియు జవహర్ నగర్ లో ప్రభుత్వ భూమిని అక్రమంగా అక్రమించున్నారని పేర్కొన్నాడు. మూడు చింతలపల్లి కేశవాపూర్ లో మంత్రి మల్లారెడ్డి 150 ఎకరాలు తక్కువ ధరలకు దొబ్బెసారని చెప్పుకొచ్చాడు . కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మల్లారెడ్డి అక్రమాల పై విచారణ జరిపిస్తాము. అంతేకాక ఆయన అల్లుడు చెరువుని కబ్జా చేసి కళాశాల నిర్మించుకున్నాడని సంచలన వ్యాఖ్యలు చేసాడు. అంతేకాదు తాము అధికారంలోకి వచ్చాక.. మల్లారెడ్డి అక్రమాలకూ సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని వాటి ఆధారంగా మల్లారెడ్డి పై యాంటి క్రైమ్ బ్యూరో తరపున విచారణ జరిపించి మల్లరేడ్డిని జైలు పాలు చేస్తానని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాఖ్యలకు మంత్రి మల్లారెడ్డి స్పందిస్తూ .. మల్కాజ్ గిరి ఎంపీ సీటు కోసం తనను బ్లాక్ మెయిల్ చేశాడని.. డబ్బుల కోసం డిమాండ్ చేశాడని చెప్పారు. డబ్బులు ఇవ్వకపోతే తన కాలేజీలను మూసేయిస్తానని రేవంత్ బ్లాక్ మెయిల్ చేశాడని మల్లారెడ్డి మాటల తూటాలు పేల్చారు . అయితే వీరిద్దరి మద్య తెలంగాణా రాజకీయం మరింత హాట్ హాట్ గా మారింది .





Untitled Document
Advertisements