ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలలో పెను మార్పులు రాబోతున్నాయని మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసారు. ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ సిపి పార్టీ కి వ్యతిరేకంగా రాష్ట్రంలో కొత్త పొత్తులు పుట్టుకు రావొచ్చని ఉండవల్లి జోస్యం చెప్పారు. ఒకవైపు జగన్ తాను ప్రారంభించిన పథకాల గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటే .. మరో వైపు తెలుగుదేశం మరియు జనసేనలు వైసిపికి వ్యతిరేఖంగా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నాయి. అంతేకాక పొత్తుల గురించి ఈ రెండు పార్టీలు అప్పుడప్పుడు ఎంతోకొంత సమాచారాన్ని అందిస్తూనే ఉన్నాయి. అయితే ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికలలో తెలుగుదేశం మరియు జనసేన పార్టీ లు పొత్తు కుదుర్చుకునే పనిలో ఉన్నాయని ఆయన అన్నారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ మరియు జనసేన ల పొత్తు వికటించి ..తెలుగుదేశం మరియు జనసేన లు పొత్తుగా పోటి చేసేలా పరిస్థితులు ఉన్నాయని ఆయన స్పష్టం చేసారు. అంతేకాక ఆంధ్రాలో రాబోయే ఎన్నికలలో మూడు పార్టీల మద్య పోరు లా కాకుండా కేవలం రెండు పార్టీ ల మద్య పోరుగానే ఉండనున్నట్లు ఆయన వెల్లడించారు . అంతేకాక ఆంధ్రాలో బీజేపి జగన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సరసన చేరే అవకాశం కూడా లేకపోలేదని చెప్పుకొచ్చారు.