ఆరెస్సెస్ వాళ్లే దేశ స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేసారు..

     Written by : smtv Desk | Tue, May 24, 2022, 05:52 PM

ఆరెస్సెస్ వాళ్లే  దేశ స్వాతంత్రోద్యమానికి వ్యతిరేకంగా బ్రిటిష్ ఏజెంట్లుగా పనిచేసారు..

ఏఐఎంఐఎం పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అస్సాం ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ మధ్యకాలంలోని మధరసాలను మూసివేయాలని ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు. సంఘ్ పరివార్ లాగా ముస్లింలు బ్రిటిషర్ల కి తొత్తుగా వ్యవహరించలేదని బ్రిటిషర్లకు వ్యతిరేకంగా బెదిరించి మరి పోరాడాలని ఓవైసీ స్పష్టం చేశారు. హిందూ సంఘసంస్కర్త రాజా రామ్ మోహన్రాయ్ కూడా ముస్లింలు ప్రారంభించిన మదరసా లోని చదువుకున్నాడు అని ఆయన వ్యాఖ్యానించారు. సంఘ్ పరివార్ లాగా మదరసాలలో మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా నేర్పించరని ఆత్మ గౌరవం సానుభూతి వంటి నేర్పిస్తారు. అలాగే గణితం సైన్స్ అంటే అన్ని అంశాలను బోధిస్తారని ఓవైసీ స్పష్టం చేశారు. సంఘ్ పరివార్ వాళ్లు బ్రిటీషర్లకు ఏజెంట్లుగా పనిచేస్తూ భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు..ఇది మీ చరిత్ర కాదా అని చెప్పి వారిని ప్రశ్నించారు . అయితే అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యలకు హిమంత్ బిశ్వ మరియు బిజెపి నాయకులు ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.





Untitled Document
Advertisements