కేటీఆర్ రాబోయే రోజుల్లో భారత ప్రధాని అయినా ఆశ్చర్యంలేదు.. మహిళా వ్యాపారవేత్త

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 08:44 AM

కేటీఆర్ రాబోయే రోజుల్లో భారత ప్రధాని అయినా ఆశ్చర్యంలేదు..  మహిళా వ్యాపారవేత్త

తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఐటీ రంగంలో దూసుకుపోతూ పలు ఐటీ కంపెనీలు తెలంగాణలోని హైదరాబాద్ కి తీసుకురావడానికి ఆయన చేస్తున్న కృషి గురించి అందరికి తెలిసిందే. ఐటీ శాఖ మంత్రిగా కేటీఆర్ పనితీరుకు ఆకర్షితురాలైన అమెరికాలోని వెంచర్ క్యాపిటలిస్ట్, మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ఆయన పై ప్రశంసలు కురిపించారు. అన్ని అంశాలపైనా స్పష్టమైన అవగాహన, భావ వ్యక్తీకరణ ఉన్న కేటీఆర్ లాంటి యువ రాజకీయ నాయయకుడిని తన జీవితంలోనే ఇప్పటి వరకు చూడలేదని అన్నారు. వచ్చే 20 ఏళ్లలో కేటీఆర్ భారతదేశ ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటూ ట్వీట్ చేశారు.
దావోస్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్‌లో కేటీఆర్‌ను కలిసిన మోత్వాని ఆయనతో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆకర్షించేందుకు కేటీఆర్ బృందం దావోస్‌లో అద్భుత కృషి చేస్తోందన్నారు. తమ రాష్ట్రంలో పెట్టబడులకు ఉన్న అవకాశాలను, అనుకూలతలను వారు వివరిస్తూ దావోస్‌లో దూసుకెళ్తున్నారని కొనియాడారు.


Untitled Document
Advertisements