మెరియోపోల్ లోని అపార్ట్ మెంట్ లో 200కి పైగా మృతదేహాలు..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 10:39 AM

మెరియోపోల్ లోని అపార్ట్ మెంట్ లో 200కి పైగా మృతదేహాలు..

ఉక్రెయిన్ రష్యా యుద్ధం ప్రారంభమైన రెండు నెలల్లో గడిచినా ఇంకా యుద్ధము ఆగలేదు . అయితే రష్యా ఉక్రెయిన్ పై అదే తీరుగా దాడి చేస్తూనే ఉంది. ఈ తరుణంలో పాశ్చాత్య దేశాలు ఉక్రెయిన్ కు ఆయుధ సంపత్తిని సమకూర్చుతూ రష్యాపై తమదైన రీతిలో ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి. అయితే రష్యా మాత్రం ఏమాత్రం తగ్గకుండా ఉంది . పుతిన్ సేనలపై విమర్శల జడివాన కురుస్తోంది. రష్యా సేనల పోరులో అమాయక ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. మొదట జనావాసాలపై యద్ధం చేయమని చెప్పిన పుతిన్ సేనలు తరువాత మనసు మార్చుకుని ప్రజలపై కూడా దాడులకు తెగబడుతున్నారు. ఫలితంగానే లక్షలాది మంది జనాలు అసువులు బాస్తున్నారు. రష్యా దాడిలో పూర్తిగా ధ్వంసమైన మేరియుపోల్‌లో శిథిలాలను తొలగిస్తున్న క్రమంలో ఓ అపార్ట్‌మెంట్ సెల్లార్ నుంచి బాగా దుర్గంధం వచ్చింది. లోపలికి వెళ్లి చూసిన అధికారులు అక్కడి దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయారు. దాదాపు 200 వరకు మృతదేహాలు కుళ్లిన స్థితిలో కనిపించాయి. రష్యా దాడుల్లో నగరంలో దాదాపు 21 వేల మంది మృతి చెందినట్టు ఉక్రెయిన్ అధికారులు చెబుతున్నారు. ఇటీవలే మెరియోపోల్ నగరాన్ని రష్యా స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దానిని సాధించే క్రమంలో క్షిపణుల ప్రయోగం ద్వారా ఇదంతా జరిగిందని ఉక్రెయిన్ అధికారులు రష్యా పై మండిపడుతున్నారు.





Untitled Document
Advertisements