మహానాడు కార్యక్రమాన్ని కావాలని అడ్డుకుంటున్నారు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 03:50 PM

మహానాడు కార్యక్రమాన్ని కావాలని అడ్డుకుంటున్నారు.. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్ట గా భావించే మహానాడు కార్యక్రమం ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి అయితే ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు. అయితే తాము పార్టీ కార్యక్రమం కోసం నిరంతరం కష్టపడుతున్న ఏర్పాట్లు చేసుకుంటుంటే ప్రభుత్వం వాటికి భంగం కలిగిస్తుందని పేర్కొన్నారు. అయితే వేడుక కోసం తాము ఇప్పటికే స్టేడియంకు డబ్బులు కట్టి ఏర్పాట్లు చేసుకోగా పర్మిషన్ లేదంటే ఇప్పుడు గోల చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పార్టీ వారు మాత్రం తమ పాలనలో ఉన్నది రోడ్లపైన కార్యక్రమాలు నిర్వహించిన ఎటువంటి అడ్డంకి తలబెట్టలేదని చెప్పుకొచ్చారు.
ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ అసలుకే లేదని అంతట ప్రభుత్వ మొండి వైఖరి కొనసాగుతుందని ఆయన ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు గారు తెలుగు జాతి తల ఎత్తుకునేలా చేసే వైసిపి ప్రభుత్వం మాత్రం ఆంధ్రప్రదేశ్లో తలదించుకునే స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు.





Untitled Document
Advertisements