అప్పు తీసుకొని ఎగ్గొట్టడంటూ రాంగోపాల్ వర్మ పై చీటింగ్ కేసు..

     Written by : smtv Desk | Wed, May 25, 2022, 05:16 PM

అప్పు తీసుకొని ఎగ్గొట్టడంటూ రాంగోపాల్  వర్మ పై చీటింగ్ కేసు..

తెలుగు చిత్ర పరిశ్రమలో గొప్ప పేరున్న డైరెక్టర్ మరియు కాంట్రవర్సి కి ఎలాంటి వాడు రాంగోపాల్ వర్మ. అయితే ప్రతి సారి ఏదో ఒక కాంట్రవర్సీతో వార్తల్లోకి వచ్చే రాంగోపాల్ వర్మ ఈసారి తనపై ఒక కేసు నమోదు చేయించుకుని వార్తల్లోకి వచ్చాడు. కాంట్రవర్సి మాటలే కాదు కాంట్రవర్సీ చేసే సినిమాలు కూడా రాంగోపాల్ వర్మ ఇస్తూ ఉంటారు ఈ విషయం అందరికీ తెలిసిందే. అయితే హైదరాబాదు లోనే ఒక ఫైనాన్షియల్ వర్మపై మియాపూర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశాడు. 2020లో తెలంగాణలో హాట్ టాపిక్ గా మారిన దిశ ఎన్ కౌంటర్ కి సంబంధించిన సినిమాను రాంగోపాల్ వర్మ రూపొందించిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా నిర్మాణ క్రమంలో ఆర్థిక ఇబ్బందులతో వర్మ ఆ ఫైనాన్సర్ దగ్గర 56 లక్షలు అప్పుగా తీసుకుని ఇంకా తిరిగి ఇవ్వలేదని ఫైనాన్సియర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశాడు. తన స్నేహితుల ద్వారా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తో పరిచయం ఏర్పడిందని ఫైనాన్సర్ కావడంతో వర్మ తన దగ్గరకు వచ్చి మొత్తం 56 లక్షలు అప్పుగా తీసుకోగా సినిమా రిలీజ్ అయిన రోజే లేకపోతే తర్వాత రోజు మీ డబ్బు మీకు ఇచ్చేస్తాను అని చెప్పి ఇప్పటివరకు ఇవ్వలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశాడు. ఇప్పటికైనా పోలీసులు చొరవ తీసుకొని తన డబ్బును తనకు ఇప్పించాలని పోలీసులకు ఆ ఫైనాన్సియర్ ఆవేదన వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements