కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం టీవీ నటి మృతి..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 11:41 AM

కాశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పుల కలకలం టీవీ నటి మృతి..

ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్ లో మరోసారి దారుణానికి ఒడిగట్టారు. అయితే తీవ్రవాదులు ఈ సారీ ఒక టీవీ యాక్టర్ ను బలి తీసుకున్నారు. నిన్న రాత్రి 8 గంటల సమయంలో ఈ సంఘటన జరిగింది . జమ్మూ కాశ్మీర్లోని బుద్ధం జిల్లా లో టీవీ నటి అమ్రీన్ భట్ మరియు ఆమె మేనల్లుడు ఇంటి ముందర ఉన్న సమయంలో లష్కరే తోయిబాకు చెందిన తీవ్రవాదులు ఆమె పైకి మరియు ఆమె మేనల్లుడి పై కాల్పులు జరపగా.. ఆ కాల్పుల్లో బుల్లెట్లు కాస్త ఆమె మెడ నుంచి దూసుకుపోయే ఆమె అక్కడికక్కడే మరణించారు ఆమె మేనల్లుడికి బుల్లెట్స్ వల్ల చేతికి గాయాలయ్యాయి. అయితే ఈమెకు సామాజిక మాధ్యమాలలో మంచి ఫాలోయింగ్ కూడా ఉండడం వల్ల ఈ సంఘటనకు సంబంధించి ఎక్కువగా వార్తలు జనాల్లోకి చేరుకున్నాయి అయితే అమ్రీన్ భట్ మేనల్లుడి ఆరోగ్యం కుదుట గా ఉన్నట్లు వైద్య సిబ్బంది వెల్లడించారు. అయితే ఆ ఉగ్రవాదుల కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలు పెట్టారు.





Untitled Document
Advertisements