మహానాడుకు సర్వం సిద్ధం బైక్ ర్యాలీ ద్వారా చంద్రబాబుకు ఘన స్వాగతం..

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 12:48 PM

మహానాడుకు సర్వం సిద్ధం బైక్ ర్యాలీ ద్వారా చంద్రబాబుకు ఘన స్వాగతం..

తెలుగుదేశం పార్టీ ఎంతో ప్రతిష్టాత్మంగా భావించే మహానాడు కార్యక్రమం 27 28 తేదీలలో ఒంగోలు లో జరగనుంది . అయితే మహానాడు కార్యక్రమానికి తెలుగు దేశం పార్టీ వర్గాలు ఎంతగానో కష్టపడి ఏర్పాటు చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యక్రమం కోసం నేడు ఒంగోలు బయలుదేరనున్నారు. అయితే ఒంగోలులో తెలుగుదేశం పార్టీ అధినేతకు పార్టీవర్గాలు కార్యకర్తలతో కలిసి ఘన స్వాగతం పలకడానికి బైక్ ర్యాలీ వంటి కార్యక్రమాలు చేపట్టనున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ రాబోయే ఎన్నికలలో అధికారమే లక్ష్యంగా బాదుడే బాదుడు వంటి కార్యక్రమాలు చేపడుతూ ప్రజలలో ముందుకు పోవడానికి ఎంతగానో ప్రయత్నిస్తుంది. ఈ తరుణంలో మహానాడు కార్యక్రమం ద్వారా ప్రజలకు మరింత దగ్గరయ్యే అవకాశాన్ని కల్పించుకుంటూ ముందుకు పోయేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. మహానాడు కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు తీసుకున్న పథకాలు గాని భవిష్యత్తులో ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే మరియు మహానాడు కార్యక్రమంలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి అనే దానిపై నేడు సమావేశం కానున్నారు.





Untitled Document
Advertisements