వివేకా హత్య కేసులో నిందితుడి కుమారుడి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హైకోర్టు పర్మీషన్

     Written by : smtv Desk | Thu, May 26, 2022, 04:26 PM

వివేకా హత్య కేసులో నిందితుడి కుమారుడి హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హైకోర్టు పర్మీషన్

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపిన వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితులలో ఒకరైనా దేవి రెడ్డి శివారెడ్డి గురువారం నుండి బయటకు రావాల్సి వచ్చింది. అయితే శివారెడ్డి కుమారుడు ప్రారంభిస్తున్న ఆస్పత్రి ప్రారంభోత్సవానికి శివారెడ్డిని అనుమతించాల్సిందిగా శివా రెడ్డి తరఫు న్యాయవాది కోర్టులో అప్పీలు చేయగా దానికి అంగీకరించింది కానీ శివారెడ్డి తో పాటుగా సిబిఐ అధికారులను వెంటబెట్టి ప్రారంభోత్సవానికి పంపించింది. అయితే దేవి రెడ్డి శివారెడ్డి తన కుమారుడి యొక్క హాస్పిటల్ ప్రారంభోత్సవాన్ని ప్రారంభించి సిబిఐ అధికారుల ముందు తన కుటుంబ సభ్యులను కలుసుకున్నారు. అయితే ఈ ఆస్పత్రి ప్రారంభోత్సవ వేడుకలలో శివారెడ్డి ని కుటుంబ సభ్యులు మినహా ఎవరితోనూ మాట్లాడనీయలేదు. అయితే హైకోర్టు చివరికి ఉదయం పది గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు సమయాన్ని కేటాయించగా సిబిఐ అధికారుల వాహనంలోనే ఆయన ఆసుపత్రి ప్రారంభోత్సవానికి వెళ్లారు.





Untitled Document
Advertisements