పటియాల జైలులో క్రికెటర్ సిద్దూకి పౌష్టిక ఆహార వసతులు

     Written by : smtv Desk | Fri, May 27, 2022, 12:29 PM

పటియాల జైలులో క్రికెటర్ సిద్దూకి పౌష్టిక ఆహార వసతులు

టీమ్ ఇండియా మాజీ క్రికెట్ ఆటగాడు పంజాబ్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు నవజ్యోత్ సింగ్ సిద్దు దాదాపుగా 30 ఏళ్ల క్రితం సిద్దు మరియు అతని స్నేహితుడు కలిసి రోడ్డు మీద ఒక వృద్దుడిని చితకబాదారు. అయితే ఆయన అక్కడికక్కడే మరణించడం తో పరిస్థితి ఇప్పటి వరకు వచ్చింది. అప్పట్లో ఈ కేసులో అయితే బాదితుని కుటుంభ సభ్యులు కోర్టుకు ఎక్కడంతో 1999లో సిద్దు మరియు అతని స్నేహితునికి కేవలం వెయ్యి రూపాయల జరిమానా విధించి నిర్దోషులుగా ప్రకటించింది.అయితే భాదితుల కుటుంబం మాత్రం అసలు తగ్గకుండా సుప్రీమ్ కోర్టులో రివ్యూ పెటిషన్ వేయడం తో క్రికెటర్ సిద్దుకు మల్లి చుక్కెదురైంది . అయితే ఈ కేసు విషయంలో విచారణ చేపట్టిన సుప్రీమ్ కోర్టు రివ్యూ జరిపి నవజ్యోత్ సింగ్ సిద్దుకు ఒక సంవత్సర కాలం పాటు జైలు శిక్షను విధించింది. అయితే నవ్జ్యోత్ సింగ్ సిద్ధూ లొంగిపోయిన అనంతరం జైలులో తీసుకున్న ఆహారానికి అతడు అస్వస్థతకు గురయ్యాడు. అయితే నవజ్యోత్ సింగ్ సిద్ధూ కోసం జైల్లో ఒక ప్రత్యేకమైన నూనె ఏర్పాటు చేసినట్లు సమాచారం. సిద్దు బి వీఐపీ ఖైదీ కావడం వలన మరియు అతనికి అస్వస్థత ఉన్న కారణంగా తన ఆహారంలో ఆకుకూరలు కూరగాయలు పండ్లు మరియు తృణ ధాన్యాలను ఎక్కువగా ఉండేటట్లుగా మెన్యూ సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది. అయితే ఇందుకు తయారు చేసే భోజనంలో రైస్ బ్రాన్ లేదా ఆవ నూనె మాత్రమే వాడుతున్నారటా.. అయితే సిద్దు కు మొదటిరోజు ఆరోగ్యంలో అస్వస్థత రావడం వలన అతని ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ విధమైన సిద్ధం చేసినట్లుగా తెలుస్తుంది.అయితే సిద్ధూ కోలుకున్న తర్వాత అతనికి శిక్షలో భాగంగా జైలులో క్లర్క్ విధులను నిర్వర్తించాల్సిందిగా బాధ్యతలు అప్పజెప్పిన విషయం తెలిసిందే.





Untitled Document
Advertisements