ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు మోపిదేవి వెంకటరమణ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సంచలన వ్యాఖ్యలు చేశాడు. శుక్రవారం గుంటూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ముస్తఫా, మద్దాల గిరిలతో సమావేశమైన మోపిదేవి విలేకరులతో మాట్లాడుతూ .. చంద్రబాబు నాయుడు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు గారి పేరు తీయకుండా రాజకీయం చేయలేరని తేల్చి చెప్పారు. ఒకవైపు నందమూరి తారకరామారావు మరణానికి కారణమైన చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆయనకు వెన్నుపోటు పొడిచి తెలుగుదేశం పార్టీ అధినేతగా కొనసాగుతున్నారని అయినా కూడా ఆయన పేరు తెలియకుండా చంద్రబాబు రాజకీయాల లో రాణించలేక పోతున్నారని మోపిదేవి వెంకటరమణ పేర్కొన్నారు. చంద్రబాబు కేవలం ఓట్ల కోసం మాత్రమే బీసీలను దగ్గరకు తీసుకుంటున్నారని వారిచేత జెండాలు మొయిస్తున్నారని మండిపడ్డారు. అయితే సామాజిక న్యాయం అనే పేరు వస్తే దానిని జగన్ మాత్రమే చేయగలరని తమ ప్రభుత్వాన్ని గురించి గొప్పలు చెప్పుకొచ్చారు.