వామ్మో ఈ ద్విచక్రవాహనాల సంస్థ స్కూటర్ల ధర రూ.2.99 లక్షలా!

     Written by : smtv Desk | Sat, May 28, 2022, 08:40 AM

వామ్మో ఈ ద్విచక్రవాహనాల సంస్థ స్కూటర్ల ధర రూ.2.99 లక్షలా!

ప్రపంచంలో నలుములల్లో ఎక్కడ ఏ వస్తువు తయారైనా వ్యాపారపరంగా చూసుకుంటే ఏ వాణిజ్య సంస్థకైనా భారత్ ఓ ఆకర్షణీయ విపణి అనడంలో ఎటువంటి సందేహం అక్కర్లేదు. భారత్ లో అన్ని వర్గాల ప్రజలు ఉండడం చేత తమ ఉత్పత్తుల అమ్మకానికి ఇక్కడ తగిన గ్యారంటీ ఉంటుందని.. ఇక్కడ వస్తువైనా కచ్చితంగా అమ్ముడు పోతుందని ఆయా వాణిజ్య సంస్థల నమ్మకం. అదేవిధంగా భారత్ లో కచ్చితంగా తమ ఉత్పత్తుల అమ్ముడు అవుతాయి అనే నమ్మకంతో తాజాగా హంగేరీకి చెందిన కీవే సంస్థ భారత్ లో రంగప్రవేశం చేసింది.
ఈ సంస్థ స్కూటర్ల విభాగంలో రెండు మోడళ్లను భారత్ లోని ప్రజలకు పరిచయం చేయనుంది. సిక్ట్సీస్ 300ఐ, వీస్టే 300 అనే మోడళ్లను లాంఛనంగా భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. వీటి ధరలు రూ.2.99 లక్షలు (ఎక్స్ షోరూం) నుంచి ప్రారంభం అవుతాయి. అయితే, భవిష్యత్తులో ఈ ధరలు పెంచవచ్చని తెలుస్తోంది. మార్కెట్ లోకి ప్రవేశ పెట్టిన ఈ రెండు మోడళ్ల స్కూటర్లను జూన్ నుంచి కొనుగోలుదారులకు డెలివరీ ఇవ్వనున్నారు.
హంగేరీకి చెందిన కీవే చైనాకు చెందిన కియాన్ జియాంగ్ మోటార్ సైకిల్స్ గ్రూప్ అనుబంధ సంస్థ. కియాన్ జియాంగ్ ప్రపంచ ప్రఖ్యాత ఇటాలియన్ బైక్ బ్రాండ్ బెనెల్లీని కూడా సొంతం చేసుకుంది. కాగా, కీవే భారత్ లో ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా సంస్థతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతేకాదు, తన సోదర సంస్థ బెనెల్లీకి భారత్ లో ఉన్న 40కి పైగా డీలర్ షిప్ పాయింట్లను, అసెంబ్లింగ్ యూనిట్ ను కీవే వినియోగించుకోనుంది. మరి మార్కెట్ లో ఈ కొత్త వాహనాలకు ఏమేరకు డిమాండ్ ఉంటుంది అనేది.





Untitled Document
Advertisements