భార్య రెండవ పెళ్లి.. అత్తింటికి నిప్పుపెట్టిన మొదటి భర్త

     Written by : smtv Desk | Mon, Jun 27, 2022, 06:09 PM

భార్య రెండవ పెళ్లి.. అత్తింటికి నిప్పుపెట్టిన మొదటి భర్త

తిరుపత్తూరు జిల్లా వాణియంబాడి సమీపంలోని వళయంపట్టు గ్రామానికి చెందిన జయేంద్రన్‌. ఇతనికి నిషా కుమార్తె ఉంది. నిషాకు కల్లకురిచ్చికి చెందిన రమేష్‌తో 20 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు కుమార్తెలున్నారు. అయితే గత ఏడు సంవత్సరాలుగా భార్యాభర్తలు విడిపోవడంతో భార్య నిషా రెండవ వివాహం చేసుకుని రెండవ భర్త రవికుమార్‌తో కలిసి జీవిస్తోంది. ఈ నేపథ్యంలో నిషా మొదటి భర్త రమేష్‌ వీరిని నిలదీశారు.దీనిపై ఇరు కుటుంబాల మధ్య ఘర్షణ జరుగుతోంది. ఇదిలా ఉండగా శనివారం రాత్రి అత్తింటికి వచ్చిన రమేష్‌ కోపంతో ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ విషయాన్ని భార్య నిషాకు ఫోన్‌ చేసి చెప్పాడు.అది గమనించిన స్థానికులు మంటలను అదుపు చేసి వాణియంబాడి పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం రమేష్‌ను అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.





Untitled Document
Advertisements