పారిస్ ఒలింపిక్స్ తన అంతిమ లక్ష్యం అంటున్న పీవీ సింధు

     Written by : smtv Desk | Sat, Jul 30, 2022, 12:29 PM

పారిస్ ఒలింపిక్స్ తన అంతిమ లక్ష్యం అంటున్న పీవీ సింధు

భారత బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి, రెండుసార్లు ఒలింపిక్ పతక విజేత పీవీ సింధు తన అంతిమ లక్ష్యం 2024 పారిస్ ఒలింపిక్స్ అని స్పష్టం చేసింది. ప్రస్తుతం బర్మింహామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో బంగారు పతకం గెలుస్తానని సింధూ ఆశాభావం వ్యక్తం చేసింది. వచ్చే నెలలో జరిగే ప్రపంచ ఛాంపియన్‌షిప్ కిరీటాన్ని తిరిగి కైవసం చేసుకునేందుకు కామన్వెల్త్ గేమ్స్ సరైన వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొంది.
‘నా అంతిమ లక్ష్యం 2024లో పారిస్ ఒలింపిక్స్. ప్రస్తుతానికైతే నా దృష్టి అంతా కామన్వెల్త్ పతకం, ఆపై ప్రపంచ పియన్‌షిప్‌లపైనే ఉంది. కామన్వెల్త్ గేమ్స్‌లో గెలవడం ఒక పెద్ద ఘనత అవుతుంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఈవెంట్లో మన దేశానికి ప్రాతినిధ్యం వహించడం చాలా గర్వకారణం. ఈసారి స్వర్ణం సాధిస్తానన్న ఆశతో ఉన్నా’ అని సింధు చెప్పుకొచ్చింది. భారత బ్యాడ్మింటన్‌లో అత్యుత్తమ క్రీడాకారిణిగా ఎదిగిన సింధు ఎల్లప్పుడూ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడమే తన విజయ రహస్యమని చెప్పింది.





Untitled Document
Advertisements