ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి..ఇలా చెక్ చేసుకోండి..

     Written by : smtv Desk | Wed, Aug 03, 2022, 01:30 PM

 ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు వచ్చేశాయి..ఇలా చెక్ చేసుకోండి..

విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేశారు. ఈ ఏడాది జూలై 6 నుంచి 15 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. గత రెండేళ్ల నుంచి కరోనా కారణంగా ఎటువంటి పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది జరిగిన పరీక్షల్లో అనుకున్న దానికన్నా కూడా తక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు సప్లిమెంటరీ ద్వారా మరోసారి ఎగ్జామ్ రాసే అవకాశం లభించింది. ఏపీ టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలు వచ్చేశాయి. ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ఏపీ 10వ తరగతి సప్లిమెంటరీ ఫలితాలు చెక్ చేయండిలా..
*ముందుగా https://www.bse.ap.gov.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
* హోమ్ పేజీలో టెన్త్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల లింక్ పైన క్లిక్ చేయాలి.
* హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి సెర్చ్ చేయాలి.
* ఫలితాలు స్క్రీన్ పైన కనిపిస్తాయి.
* ప్రింట్ తీసుకొని PDF ఫార్మాట్‌లో సేవ్ చేసుకోవచ్చు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈసారి పదోతరగతి ఫలితాల్లో గ్రేడ్లకు బదులుగా మార్కుల రూపంలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 27 నుంచి మే 9 వరకు జరిగిన పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 6,22,537 విద్యార్థులు హాజరయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,776 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. పరీక్షలకు హాజరైనవారిలో 4,14,281 మంది ఉత్తీర్ణత సాధించారు.
ఫలితాల్లో మొత్తం 67.26 శాతం ఉతీర్ణత నమోదైంది. పదో తరగతి రెగ్యులర్ పరీక్షలకు మొత్తం 11751 స్కూళ్లకు చెందిన విద్యార్థులు హాజరుకాగా వీటిలో 797 పాఠశాలల్లో నూటికి నూరు శాతం విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 71 స్కూళ్లలో 0 శాతం ఉత్తీర్ణత నమోదైంది. పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించలేని విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించారు. వీరికి జూలై 6 నుంచి 15 వరకు పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్‌కు 2,01,627ల మంది విద్యార్ధులు హాజరయ్యారు.
ప్రభుత్వం కీలక నిర్ణయం : సప్లిమెంటరీ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన వారిని 2022-ఏప్రిల్‌ రెగ్యులర్‌ బ్యాచ్‌ విద్యార్థులతో సమానంగా పరిగణించనుంది. నిబంధనల ప్రకారం రెగ్యులర్‌ పరీక్షల్లో ఉత్తీర్ణులకు వారికి వచ్చిన మార్కులను అనుసరించి ఫస్ట్, సెకండ్, థర్డ్‌ డివిజన్‌లలో పాసైనట్లుగా సర్టిఫికెట్లు ఇస్తారు. సప్లిమెంటరీలో పాసైన వారికి మాత్రం ఎన్ని మార్కులు వచ్చినా కంపార్టుమెంటల్‌ పాస్‌గానే పరిగణిస్తుంటారు. ఆమేరకు ధ్రువపత్రాలు జారీచేస్తారు.
అయితే కరోనా కారణంగా రెండేళ్లుగా స్కూళ్లు లేక చదువులు కుంటుపడిన విద్యార్థులు టెన్త్‌ పరీక్షల్లో కొంతవరకు ఇబ్బందులకు గురైనందున వారికి మేలు చేకూరేలా సప్లిమెంటరీ పరీక్షలకు వర్తించే కంపార్టుమెంటల్‌ పాస్‌ను ఈ విద్యా సంవత్సరం వరకు మినహాయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.





Untitled Document
Advertisements