బతుకమ్మ పండుగ సందర్భంగా ‘సిరిమల్లెలో రామ రఘుమెల్లెలో’ అనే బతుకమ్మ ప్రత్యేక గీతాన్ని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గురువారం తన నివాసంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ పాట తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా ఉందని అన్నారు. ఈ పాటను రూపొందించిన జెన్నారం జెడ్పీటీసీ ఎర్ర శేఖర్ బృందాన్ని అభినందించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు పెద్ద పీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో హోమ్ మినిస్టర్ మహమూద్ అలీ, రాష్ట్ర సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ దీపికారెడ్డి , ఉర్దూ అకాడమీ చైర్మన్ ముజీబ్, హాజ్ కమిటీ చైర్మన్ సలీం, టీఎస్ ఫుడ్స్ చైర్మన్ రాజీవ్ సాగర్ తదితరులు పాల్గొన్నారు.