సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన బ్లాక్బాస్టర్ హిట్ 'పోకిరి' చిత్రం తరువాత నటించిన సైనికుడు, అతిథి, ఖలేజా సినిమాలకు బాక్సాఫీసు వద్ద ఎక్కువ క్రేజ్ రాలేదు. ఇంకేలగైన హిట్ కొటాలనుకున్న మహేష్ కొత్త పంథా ఎంచుకున్నాడు. శ్రీను వైట్ల దర్శకత్వంలో దూకుడు మూవీకి సైన్ చేశాడు. తనలోని కామెడీ యాంగిల్ బయట పెడుతునే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కనిపించాడు. 2011 సెప్టెంబర్ 2 3న రిలీజ్ అయిన ఈ మూవీ అప్పట్లో ఇండస్ట్రీని షేక్ చేసింది. వసూళ్ల పరంగా అప్పటివరకు ఉన్న రికార్డులను బద్దలు కొట్టింది.
ఈ మూవీలో మహేష్ బాబు సరసన సమంత హీరోయిన్గా యాక్ట్ చేసింది. ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, సోనూసూద్, చంద్రమోహన్, తనికెళ్ల భరణి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. విలన్ను బకరా చేస్తూ బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ, మహేష్ బాబు కాంబినేషన్లో వచ్చిన కామెడీ సీన్స్ అభిమానులకు ఎప్పుడు గుర్తుండిపోతాయి. ఈ సినిమా ఎప్పుడు బుల్లితెరపై ప్రసారం అయినా ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతారు.
దూకుడు మూవీ విడుదలై 11 ఏళ్లు పూర్తయిన సందర్భంగా డైరెక్టర్ శ్రీను వైట్ల ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు. ' దూకుడు మూవీ రిలీజ్ అయి 11 ఏళ్లు పూర్తి చేసుకుంది. మహేష్ బాబు ఈ మూవీ స్క్రిప్ట్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాడు. ఇది నా పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే అత్యంత విలువైన బహుమతిని ఇచ్చింది. మొత్తం నటీనటులు, సిబ్బందికి, ఎప్పటికీ మీ హృదయాలలో ఉంచినందుకు అభిమానులకు ధన్యవాదాలు..' అంటూ ఆయన రాసుకొచ్చారు.