ఒకే ఒక జీవితం అందరికి కనెక్ట్ అయ్యిన సినిమా..

     Written by : smtv Desk | Fri, Sep 23, 2022, 03:46 PM

ఒకే ఒక జీవితం అందరికి కనెక్ట్  అయ్యిన సినిమా..

శర్వానంద్ నటించిన సినిమా 'ఒకే ఒక జీవితం' సినిమాకు మంచి టాక్ వచ్చింది. విమర్శకుల ప్రశంసలతో పాటు కలెక్షన్లు కూడా బాగానే వచ్చాయి. అయితే ఈ చిత్రంతో శ్రీ కార్తీక్ దర్శకుడిగా తన మార్క్ వేశాడు. మొదటి చిత్రంతోనే అందరినీ ఆశ్చర్యపరిచాడు. అమల అక్కినేని, రీతూ వర్మ, ప్రియదర్శి, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు . ఈ క్రమంలో శర్వానంద్ సినిమా గురించి ఆసక్తికరమైన విశేషాలు పంచుకున్నాడు. సినిమా విజయవంతం అవ్వడం ఆనందంగా వుంది. ప్రేక్షకులు ఖచ్చితంగా సినిమాకి కనెక్ట్ అవ్వాలని అనుకున్నాం. మేము ఊహించినట్లే సినిమా అందరికీ కనెక్ట్ అయ్యింది. దీంతో ఒక బరువు దిగిందనే భావన కలిగింది. అదే సమయంలో కొత్తగా చేయబోయే సినిమాల గురించి కొంత కంగారు మొదలైయింది అంటూ తన సంతోషాన్ని పంచుకున్నాడు శర్వానంద్. ఈ సినిమా విషయంలో ప్రేక్షకుల కంటే విమర్శకులు ఎలా రియాక్ట్ అవుతారనే భయం వుండేది. అయితే లక్కీగా విమర్శకులకు కూడా సినిమా నచ్చింది. దర్శకుడు హను అయితే ఈ సినిమా పిల్లలకి ఎక్కువ చూపించాలని చెప్పారు. పిల్లల కోసం ఒక స్పెషల్ షో వేశాం. చాలా ఎంజాయ్ చేశారు అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. నాకు అఖిల్ చిన్నప్పటి నుండి తెలుసు. ఐతే అమల గారు, నాగార్జున గారితో ఎక్కువ ఇంటరాక్షన్ ఈ సినిమాతోనే మొదలైయింది. నిజంగా మూడో కొడుకులానే చూస్తారు. ఈ విషయంలో నేను లక్కీ అంటూ శర్వానంద్ చెప్పుకొచ్చాడు. ఇక నిన్నటి బిగ్ బాస్ స్టేజ్ మీద కూడా అదే విషయాన్నిశర్వానంద్ పంచుకున్నాడు.





Untitled Document
Advertisements