‘బాహుబలి’ సినిమాలతో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన దర్శక ధీరుడు యస్యస్. రాజమౌళి , తర్వాత వచ్చిన ‘ఆర్ఆర్ఆర్’తో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచుకున్నాడు. ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అవుతున్న నాటి నుంచి ఈ సినిమాపై వెస్ట్రన్ ఆడియన్స్ పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. హాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు కూడా ‘ఆర్ఆర్ఆర్’ వీక్షించి జక్కన్నను మెచ్చుకున్నారు. ఫలితంగా అతడి ఫేమ్ అంతర్జాతీయ స్థాయికి చేరుకుంది. ఈ నేపథ్యంలో హాలీవుడ్ టాలెంట్ కంపెనీ క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ (సీఏఏ) తో రాజమౌళి ఒప్పందం కుదుర్చుకున్నాడు. క్రియేటివ్ ఆర్టిస్ట్స్ ఏజెన్సీ తమతో ఒప్పందం కుదుర్చుకున్నవారికి ఇంటర్నేషనల్ స్థాయిలో అవకాశాలను కల్పిస్తుంది. ఈ ఏజెన్సీకి అనేక మంది హాలీవుడ్ దర్శకులు క్లయింట్స్గా ఉన్నారు. రాజమౌళి తన తర్వాతి సినిమాను మహేశ్ బాబు తో చేయనున్నాడు. యాక్షన్ అడ్వెంచర్గా రూపొందించనున్నాడు. ప్రపంచాన్ని చుట్టి వచ్చే సాహసికుడి యాత్ర అని కొన్ని రోజుల క్రితమే జక్కన్న చెప్పాడు. ఈ సినిమాను ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కించాలనే ఆలోచనలో రాజమౌళి ఉన్నట్టు సమాచారం. ఇప్పటికే కొన్ని ఇంటర్నేషనల్ స్టూడియోస్తో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అందువల్లే హాలీవుడ్ టాలెండ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజమౌళితో సినిమా చేయడం తన కల అని మహేశ్ బాబు గతంలోనే చెప్పాడు . ‘‘రాజమౌళి గారితో ఒక్క సినిమాకు పనిచేస్తే 25 చిత్రాలకు పనిచేసినట్లే. ఈ మూవీలోని పాత్ర కోసం చాలా శ్రమించాలి. చిత్రం దానిని డిమాండ్ చేస్తుంది. మూవీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. పాన్ ఇండియాగా తెరకెక్కనుంది. ఈ సినిమా దేశంలోని ప్రేక్షకులందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’’ అని మహేశ్ బాబు పేర్కొన్నాడు