"పుష్ప" హీరోయిన్ కి మోకాలి నొప్పి..

     Written by : smtv Desk | Sat, Sep 24, 2022, 02:57 PM


'పుష్ప' సినిమా తరువాత జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన రష్మిక మందాన వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు రావడంతో బిజీ బిజీ గా ఉంటోంది ఈ కన్నడ బ్యూటీ. అయితే గత కొంత కాలంగా రష్మిక మోకాళ్ల నొప్పులతో బాధపడుతోందని సమాచారం. ఈ కారణంగా హైదరాబాద్ లోని ప్రముఖ ఆర్థోపెడిక్ డాక్టర్ గురువారెడ్డిని కలవడం జరిగింది. ఈ విషయాన్ని డాక్టర్ గురువారెడ్డి స్వయంగా తెలిపారు. మోకాళ్ల నొప్పులతో బాధ పడుతూ రష్మిక తన వద్దకు వచ్చిందని చెప్పారు. అయితే, కంగారు పడాల్సిందేమీ లేదని ఆయన తెలిపారు. రష్మిక తన వద్దకు రావడంపై డాక్టర్ గురువారెడ్డి తన ఫేస్ బుక్ అకౌంట్ ద్వారా సరదాగా స్పందించారు. 'సామీ.. సామీ' అంటూ బరువంతా మోకాళ్లపై వేసి ద్యాన్స్ చేయడం వల్లే మోకాళ్ల నొప్పులు వచ్చాయని కామెడీగా రష్మికతో చెప్పానని అన్నారు. 'పుష్ప' సినిమా చూసినప్పటి నుంచి రష్మికను కలిసి అభినందించాలనుకున్నానని.. అయితే, మోకాలి నొప్పి వల్ల ఆమెను కలిసే అవకాశం వచ్చ్హిందని ఆయన అన్నారు. తొందరలోనే అల్లు అర్జున్ కూడా భుజం నొప్పితో వస్తాడేమోనని సరదా వ్యాఖ్యలు చేశారు.





Untitled Document
Advertisements