నటి కాజల్ అగర్వాల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో కలసి సోమవారం తిరుమలలో వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు దంపతులను పట్టువస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కాజల్ మీడియాతో మాట్లాడుతూ, శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని, తన భర్త గౌతమ్ తో కలిసి తిరుమల ఆలయాన్ని సందర్శించడం ఇదే తొలిసారి అని అన్నారు.
2020 అక్టోబర్ లో కాజల్ అగర్వాల్ మరియు గౌతమ్ ల వివాహం జరిగింది. 2022 ఏప్రిల్ లో వారికి మగ బిడ్డ పుట్టాడు. ఆ ఫోటో లను కాజల్ భర్త తన సోషల్ మీడియా లో పంచుకున్నాడు. పెళ్లి తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చిన కాజల్, త్వరలో తిరిగి తెరపై కనిపించనుంది.