భర్త వేధింపులు తట్టుకోలేక గొడ్డలితో నరికి చంపిన భార్య..

     Written by : smtv Desk | Wed, Sep 28, 2022, 04:04 PM

భర్త వేధింపులు తట్టుకోలేక గొడ్డలితో నరికి చంపిన భార్య..

చత్తీస్‌గఢ్‌లో సంచలనం ఓ మహిళ తన భర్తపై గొడ్డలితో దాడి చేసింది. మొదటి భార్య చనిపోవడంతో మరో మహిళను వివాహం చేసుకున్న వ్యక్తి. ఆమె అందంగా లేదని తరుచూ వేధించేవాడు. నల్లగా ఉన్నావంటూ ఆమె రంగు గురించి మాట్లాడటంతో భార్య మనసు గాయపడింది. అతడి వేధింపులను తట్టుకోలేక పట్టరాని ఆవేశంతో గొడ్డలితో నరికి చంపింది.
పోలీసుల కథనం ప్రకారం. దుర్గ్ జిల్లా అమలేశ్వర్‌ గ్రామంలో అనంత్‌ సోన్‌వానీ (40), సంగీత సోన్‌వానీ (30) దంపతులు నివసిస్తున్నారు. భార్యను అందంగా లేవని, నల్లగా ఉన్నావంటూ అతడు తరచూ వేధించేవాడు. దీని గురించి ఇద్దరి మధ్య తరుచూ గొడవలు జరిగాయి. సంగీతను నల్లగా ఉన్నావంటూ భర్త కించపరుస్తూ మాట్లాడటం ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్ర ఆగ్రహానికి గురైన భార్య ఇంట్లో ఉన్న గొడ్డలితో అనంత్‌పై దాడి చేసింది. అతడి మర్మాంగాన్ని కూడా కోసేసింది. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే అతడు మృతి చెందాడు. అయితే, తన భర్తను ఎవరో హత్య చేశారంటూ కట్టుకథలు అల్లి గ్రామస్థులను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించింది. ఘటనాస్థలిలో పరిస్థితి చూసి అనుమానించిన గ్రామస్థులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టడంతో తానే నేరం చేసినట్టు సంగీత ఒప్పుకుంది. అందంగా లేవని తరుచూ వేధింపులకు గురిచేయడంతో తట్టుకోలేకపోయానని వెల్లడించింది.
పెళ్లి చేసుకున్నప్పటి నుంచి ఇదే తంతని, తరుచూ ఈ విషయమై తమ ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండేవని వివాహిత తెలిపింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితురాలిని అరెస్టు చేసి జైలుకు తరలించినట్టు స్థానిక పోలీసు అధికారి దేవాన్ష్ రాథోడ్ వెల్లడించారు. మృతుడి అనంత్‌కు మొదటి భార్య చనిపోవడంతో సంగీతను రెండో వివాహం చేసుకున్నట్టు తెలిపారు. మొదటి భార్యకు ఒక కుమారుడు (12), రెండో భార్యకు నాలుగు నెలల పాప ఉందని పేర్కొన్నారు.





Untitled Document
Advertisements