డ్రోన్లతో ఇరాక్‌పై దాడి చేసిన క్షిపణులు.. 13 మంది మృతి పలువురికి గాయాలు..

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 11:29 AM

డ్రోన్లతో ఇరాక్‌పై దాడి చేసిన క్షిపణులు.. 13 మంది మృతి పలువురికి గాయాలు..

ఇరాక్‌లోని కుర్దిస్థాన్‌పై ఇస్లామిక్‌ తిరుగుబాటుదారులు క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడ్డారు. దీంతో 13 మంది మరణించగా, 58 మంది గాయపడ్డారు. మృతుల్లో ఓ గర్భిణి కూడా ఉందని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని ఇస్లామిక్‌ తిరుగుబాటుదారులు పొరుగున ఉన్న ఇరాక్‌లో కుర్దిష్‌ రీజియన్‌పై బాంబుల వర్షం కురిపించారు. తమ దేశంలో గత కొంతకాలంగా జరుగుతున్న అలజడికి ఇరాక్‌కు చెందిన ఉగ్రవాదులే కారణమని పేర్కొంటూ ఈ దాడికి దిగినట్లు తెలిసింది. కుర్దిస్థాన్‌లోని సులేమానియా, ఎర్బిల్‌పై బాంబుల వర్షం కురిపించారని అధికారులు వెల్లడించారు. కాగా, ఇరాన్‌కు చెందిన డ్రోన్లు ఇరాక్‌లోని ఎర్బిల్‌వైపు
ప్రయణించాయని యూఎస్‌ ఆర్మీ సెంట్రల్‌ కమాండ్‌ వెల్లడించింది. ఈ దాడివల్ల అమెరికన్‌ ఆర్మీ బేస్‌కు ఎలాంటి నష్టం వాటిళ్లలేదని తెలిపింది.





Untitled Document
Advertisements