12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు ప్రభాస్..లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాట్లు

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 12:52 PM

12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు ప్రభాస్..లక్ష మంది అభిమానులకు భోజన ఏర్పాట్లు

రెబల్ స్టార్ కృష్ణంరాజు స్వగ్రామమైన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో గురువారం ఆయన సంస్మరణ సభ జరుగుతోంది. ఈ సందర్భంగా ఈ సభలో పాల్గొనేందుకు హీరో ప్రభాస్ మొగల్తూరుకు చేరుకున్నారు. ప్రభాస్ దాదాపు 12 ఏళ్ల తర్వాత తన సొంతూరుకు వెళ్ళారు. దీంతో ఆయనను చూసేందుకు అభిమానులు తండోపతండాలుగా వస్తున్నారు. మొగల్తూరులో పండుగ వాతావరణం నెలకొంది. తన కుటుంబసభ్యులతో కలిసి అభిమానులకు ప్రభాస్ అభివాదం చేశారు. ఈ మధ్యాహ్నం అభిమానుల కోసం ప్రభాస్ టీమ్ పెద్ద ఎత్తున భోజన ఏర్పాట్లు చేసింది. దాదాపు లక్ష మంది అభిమానుల కోసం భోజన ఏర్పాట్లు చేశారు. కృష్ణంరాజు భోజనప్రియుడు అన్న సంగతి తెలిసిందే. దీంతో, ఆయనకు ఇష్టమైన వంటకాలతో భోజన ఏర్పాట్లు చేశారు. 25 రకాల వెజ్, నాన్ వెజ్ వంటకాలను సిద్ధం చేశారు. ముఖ్య అతిథులకు కృష్ణంరాజు ఇంటి ఆవరణలోనే ఏర్పాట్లు చేశారు. ఇతరులకు ఇంటికి దక్షిణం వైపు ఉన్న తోటలో ఏర్పాట్లు చేశారు. అభిమానులు భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు ముందస్తుగానే భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.





Untitled Document
Advertisements