వరుసగా ఏడో రోజు నిరాశపరిచిన స్టాక్ మార్కెట్

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 04:42 PM

వరుసగా ఏడో రోజు నిరాశపరిచిన స్టాక్ మార్కెట్

దేశీయ మదుపర్లకు వరుసగా ఏడో రోజు కూడా నిరాశే మిగిలింది. మార్కెట్లు వరుసగా ఏడో రోజు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ ఆర్థికమాంద్యం భయాలు ఇన్వెస్టర్లపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. ఈ క్రమంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 188 పాయింట్లు నష్టపోయి 56,409కి పడిపోయింది. నిఫ్టీ 40 పాయింట్లు కోల్పోయి 16,818 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్: ఐటీసీ (2.51%), డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ (2.16%), టాటా స్టీల్ (1.68%), సన్ ఫార్మా (1.38%), నెస్లే ఇండియా (1.17%). టాప్ లూజర్స్: ఏసియన్ పెయింట్స్ (-5.22%), టెక్ మహీంద్రా (-1.86%), టైటాన్ (-1.69%), కోటక్ బ్యాంక్ (-1.49%), బజాజ్ ఫైనాన్స్ (-1.36%).





Untitled Document
Advertisements