ప్రపంచకప్ కు ముందు భారత జట్టుకు షాక్.. బుమ్రాకు గాయం

     Written by : smtv Desk | Thu, Sep 29, 2022, 04:59 PM

ప్రపంచకప్ కు ముందు భారత జట్టుకు షాక్.. బుమ్రాకు గాయం

మూడు వారాల్లో ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్ ఆడనున్న టీమిండియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్నునొప్పితో వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. అతడికి కనీసం 6 నెలల విశ్రాంతి అవసరమని తెలుస్తోంది. ఇటీవల యూఏఈలో మోకాలి గాయం కావడంతో రవీంద్ర జడేజా ఇప్పటికే వరల్డ్ కప్ కు దూరం కాగా, ఇప్పుడు బుమ్రా కూడా జట్టుకు దూరం అయ్యాడు. ఆస్ట్రేలియాతో మూడో టీ20 మ్యాచ్ లో ఆడిన బుమ్రా భారీగా పరుగులు ఇచ్చాడు. 4 ఓవర్లు వేసి 50 పరుగులు ఇచ్చుకున్నాడు. ఒక మ్యాచ్ లో 50 పరుగులు ఇవ్వడం తన కెరీర్ లోనే తొలిసారి.





Untitled Document
Advertisements