పుష్ప సక్సెస్ తో పాన్ ఇండియా స్టార్ అయిపోయిన అల్లు అర్జున్ గురువారం మధ్యాహ్నం అమృత్సర్లోని స్వర్ణ దేవాలయంని సందర్శించారు. అల్లు అర్జున్ భార్య అల్లు స్నేహ రెడ్డి పుట్టినరోజు వేడుకలను అమృత్సర్ లో జరుపుకుంటున్నారు. ఈ సందర్బంగా కుటుంబ సమేతంగా ఆయన స్వర్ణ దేవాలయాన్నిదర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన తన కుటుంబంతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాలుపంచుకున్నారు. స్వర్ణ దేవాలయంలో అల్లు అర్జున్ కుటుంబంతో కలిసి కనిపించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. పుష్ప-2 చిత్రం షూటింగ్లో బిజీబిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే సంవత్సరం విడుదలయ్యే అవకాశం ఉంది. మొదటి భాగం భారీ విజయం సాధించటంతో పుష్ప రెండో భాగాన్ని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారని సమాచారం.