నారా బ్రాహ్మణిపై ఫేస్బుక్ లో అభ్యంతరకర పోస్టుల పెట్టిన ఆర్‌ఎంపీని చితకబాదిన టీడీపీ కార్యకర్తలు

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:21 PM

నారా బ్రాహ్మణిపై ఫేస్బుక్ లో అభ్యంతరకర  పోస్టుల పెట్టిన ఆర్‌ఎంపీని చితకబాదిన  టీడీపీ కార్యకర్తలు

టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణిపై ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు ఖమ్మం జిల్లా టేకులపల్లిలో ఆర్‌ఎంపీని తెలుగుదేశం కార్యకర్తలు చితకొట్టారు. కృష్ణా జిల్లాకు చెందిన టేకులపల్లిలో ఆర్‌ఎంపీగా పనిచేస్తున్న కోదాటి నరసింహ నారా బ్రాహ్మణిని కించపరిచే విధంగా పోస్టులు చేశాడని తెలుసుకున్న టీడీపీ కార్యకర్తలు కేతినేని హరీష్, నల్లమల రంజిత్, సున్న నవీన్, వి.వంశీ నరసింహులుతో మొబైల్‌లో మాట్లాడారు. ముస్తఫా నగర్‌లోని వైఎస్‌ఆర్‌టీపీ కార్యాలయంలో ఉన్నాను, రండి చూస్కుందాం అని అన్నాడు. టీడీపీ కార్యకర్తలు అక్కడికి వెళ్లి నరసింహను పోస్టుల గురించి ప్రశ్నించినప్పుడు అతను వారికి దురుసుగా సమాధానమిచ్చాడు. అతని సమాధానంతో కోపంతో రగిలిపోయిన కార్యకర్తలు నరసింహని చితకబాదారు. నందమూరి, నారా కుటుంబాలపై ఎవరైనా అన్‌పార్లమెంటరీ భాష ఉపయోగిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఖమ్మం జిల్లాకు చెందిన తెలుగుదేశం నాయకుడు కూరపాటి వెంకటేశ్వర్లు హెచ్చరించారు. నరసింహపై టీడీపీ సంబంధిత పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.





Untitled Document
Advertisements