రంగాపూర్ తాండాల్లో భారీ శబ్ధంతో రెండు సెకన్ల పాటు కంపించింన భూమి

     Written by : smtv Desk | Fri, Sep 30, 2022, 12:58 PM

రంగాపూర్ తాండాల్లో భారీ శబ్ధంతో రెండు సెకన్ల పాటు కంపించింన  భూమి

రంగాపూర్ తాండాల్లో భయాందోళనలకు గురైన ప్రజలు హడావిడిగా ఇళ్ళ నుంచి బయటకు పరుగులు తీశారు. ఇంతకు ఏం జరిగిందంటే.
తెలంగాణా వికారాబాద్ జిల్లాలోని పరిగి మండలం రంగాపూర్, రంగాపూర్ తాండాల్లో భారీ శబ్ధంతో భూమి రెండు సెకన్ల పాటు కంపించింది.
దీంతో అయోమయంలో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. తుపాకీ పేల్చినట్టు శబ్దం వచ్చి భూమి కుదేసినట్టి అనిపించిందని స్థానికులు చెబుతుతున్నారు. విషయం తెలిసిన అధికారులు అక్కడకు చేరుకుని అది భూకంపమా మరేదైనా విపత్తా అని ఆరా తీస్తున్నారు.
వికారాబాద్ జిల్లాలో గతంలోనూ భూమి కంపించింది. బంట్వారం మండల పరిధిలోని తొర్మామిడి, బొపునారం, కర్ణాటక సరిహద్దు గ్రామమైన పోచారం గ్రామాల్లో నెల క్రితం భూమి కంపించడంతో ఆయా గ్రామాల ప్రజలు భయంతో ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. తొర్మామిడికి 35 కిలోమీటర్ల దూరంలో ఉన్న కర్ణాటకలోని గుల్బర్గా జిల్లా చించోలి తాలుకాలోని కర్కిచెడ్ గ్రామంలో గత రెండు నెలల కింద భూమి కంపించింది. ఆ ఘటన మరువకముందే సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.





Untitled Document
Advertisements