పశ్చిమ బెంగాల్లో దుర్ఘటన చోటు చేసుకుంది. ఒక ఇంట్లో నుండి భరించలేనంత దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అకడికి వచ్చి చుసేసరిరి ఆ ఇంటి తలుపులు మూసి ఉన్నాయి వాటిని పగలుగొట్టగా అక్కడ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యారు.
వివరాల్లోకి వెళ్తే పురూలియా జిల్లాలోని శ్యామ్పురా గ్రామానికి చెందిన 38 ఏళ్ల సంజయ్ దాస్ ఏడు రోజుల క్రితం మృతి చెందాడు. అయితే ఈ విషయం బయటకు తెలియకుండా అతడి తల్లి తుసుదాస్ మృతదేహాన్ని వారం రోజులుగా ఇంట్లోనే ఉంచింది. దీంతో ఒక్కసారిగా భరించలేని దుర్వాసన రావడం మొదలైంది.
అకడికి వచ్చిన పోలీసులు సంజయ్ దాస్ మృతదేహం పక్కన అపస్మారక స్థితిలో అతడి తల్లి పడి ఉండటాన్ని గమనించారు. ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అంతేకాకుండా మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా, సంజయ్ దాస్ మృతికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.