దసరా సందర్భంగా ప్రజలు తమ సొంతూర్లకు వెళ్ళేవారు తగిన జాగ్రత్తలు తీసుకోకుంటే చోరీలు తప్పవని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రైకమిషనరేట్లలో పోలీసులు హెచ్చరించారు. ఇంట్లో ఉన్నవారు ఇంటికి తాళం వేసి ఎక్కడికైనా వెళ్లే సమయంలో చోరీలు జరుగుతున్నాయి. దసరా సెలవుల సమయంలో, హైదరాబాద్లోని కుటుంబాలు సుదీర్ఘ సెలవుల కోసం నగరం నుండి వారి సొంతూర్లకు వెళ్తారు. ఇదే అదునుగా తీసుకుని దొంగలు చోరీలకు పాల్పడుతారు. స్థానిక బీట్ కానిస్టేబుల్ ఇంటిపై నిఘా ఉంచే అవకాశం ఉన్నందున పట్టణం నుండి బయటకు వెళితే స్థానిక పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని పోలీసులు ప్రజలను కోరారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ను ఇన్స్టాల్ చేయడం చాలా వరకు సహాయపడుతుంది ఎందుకంటే మామూలు తాళాలు బయటకి కనిపిస్తాయి. దీని వల్ల ఇంట్లో ఎవరు లేరని సులభంగా తెలుస్తుంది. "మీరు లేనప్పుడు ఇంటిపై నిఘా ఉంచమని స్థానిక బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులకు తెలియజేయండి. నిఘా కెమెరాలను అమర్చండి మరియు డీవిఆర్ ని సురక్షితమైన స్థలంలో ఉంచండి. మీ ఫోన్ నుండి మీ ఇంట్లో మరియు చుట్టుపక్కలను గమనిస్తూ ఉండండి" అని ఒక సీనియర్ పోలీసు చెప్పారు. వార్తాపత్రికలు, పాల ప్యాకెట్లు ఇంటి ముందు పడి ఉండడం వల్ల ఇంట్లో ఎవరు లేరనే సూచనను ఇస్తుందని అన్నారు. ప్రజలకు వార్తాపత్రికలు, పాల సరఫరాను నిలిపివేయాలని పోలీసులు సూచించారు. బయలుదేరే ముందు అన్ని తలుపులు, కిటికీలు సరిగ్గా వేసారా లేదా అని చూసుకోవాలని చెప్పారు. దొంగలకు ఉపయోగపడే నిచ్చెనలు మరియు ఇతర సాధనాలను తీసివేయాలి. దసరా సెలవుల కోసం పోలీసులు యాక్షన్ ప్లాన్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇందులో పెట్రోలింగ్ను పెంచడం, అనుమానితులను తనిఖీ చేయడం మరియు స్థానిక మరియు ఇతర రాష్ట్రాల నేరస్తుల ముఠాల కదలికలపై నిఘా ఉంచడం వంటివి ఉన్నాయి.