ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ వెలువడింది. 269 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. గ్రూప్-4 సర్వీసెస్ కింద 06, పలు విభాగాల్లో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలు 45, ఆయుష్ (ఆయుర్వేదం)లో వైద్యాధికారులు 72, ఆయుష్ (హోమియో)లో 34 లెక్చరర్ పోస్టులు, 53 వైద్యాధికారులు, ఆయుష (యునాని)లో 26 వైద్యాధికారులు, పలు విభాగాల్లో 23 ఏఈఈ ఉద్యోగాలు, సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు 07, అసిస్టెంట్ ప్రొఫెసర్ 03 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోగలరు. విభాగాల వారీగా పోస్టులు దరఖాస్తు చేసుకోవల్సిన తేదీలు గ్రూప్-4 లో 6 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 19 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. నాన్ గెజిటెడ్ - 45 పోస్టులున్నాయి. ఈ పోస్టులకు అక్టోబర్ 11 నుంచి నవంబర్ 2 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయుర్వేద లెక్చరర్లు- 3 పోస్టులున్నాయి. అక్టోబర్ 7 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హోమియో లెక్చరర్లు- 34 పోస్టులున్నాయి. అక్టోబర్ 7 నుంచి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఆయుర్వేద మెడికల్ ఆఫీసర్- 72 పోస్టులున్నాయి. అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. హోమియో మెడికల్ ఆఫీసర్- 53 పోస్టులున్నాయి. అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. యునాని మెడికల్ ఆఫీసర్- 26 పోస్టులున్నాయి. అక్టోబర్ 6 నుంచి 21 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఈఈ- 23 పోస్టులున్నాయి. అక్టోబర్ 6 నుంచి నవంబర్ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. సివిల్ అసిస్టెంట్ సర్జన్- 7 పోస్టులున్నాయి. అక్టోబర్ 27 నుంచి నవంబర్ 16 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
పూర్తి వివరాలు https://psc.ap.gov.in/ వెబ్సైట్లో చూడవచ్చని ఏపీపీఎస్సీ కార్యదర్శి అరుణ్కుమార్ తెలిపారు.