రాహుల్ గాంధీ రాజకీయాలకు అనర్హుడు కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత బిశ్వ శర్మ

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 11:24 AM

రాహుల్ గాంధీ  రాజకీయాలకు అనర్హుడు కాంగ్రెస్‌పై మండిపడ్డ హిమంత  బిశ్వ శర్మ

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేశారు. గాంధీల ఫ్యామిలీకి కాలం చెల్లిన మందులు లాంటి వారన్నారు. కాంగ్రెస్ పార్టీ అసలు ప్రతిపక్షానికి కూడా పనికిరాదని ఆయన ఆరోపణలు చేశారు. అంతేకాదు రాహుల్ గాంధీకి అసలు సీరియస్‌నెసే లేదని, ఆయన రాజకీయాలకు అనర్హుడని అన్నారు. 2024లో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తుందని, అత్యధిక మెజార్టీతో అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ దేశంలో అధికార పార్టీ అని భావిస్తోందని ఎఎన్ఐ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విమర్శలు చేశారు. కాంగ్రెస్ నేతలు కనీసం ప్రతిపక్ష పాత్రను కూడా సరిగ్గా నిర్వర్తించలేరు. తామే అధికార పార్టీ అని వారి మనస్సులో ఉందని ఆయన అన్నారు. "నరేంద్ర మోదీ బలవంతంగా ప్రధాని పీఠంపై ఉన్నారని, ఆ సీటు తమకే చెందుతుందని వారు ఎక్కడో భావిస్తున్నారు. వారు విపరీతమైన కోపంతో ఉన్నారు." అని హిమాంత బిశ్వా అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష ప్రభుత్వాలను బర్తరఫ్ చేసేందుకు ఆర్టికల్ 356ను దుర్వినియోగం చేసిందని హిమంతా బిశ్వా ఆరోపించారు. "నరేంద్ర మోదీ ఆ ఏకపార్టీ వ్యవస్థను సవాల్ చేసే వ్యక్తి కాంగ్రెస్‌ ఆధిపత్యాన్ని ఆయన సవాల్‌ చేస్తున్నారు. వారు దేశంలో ఒక కుటుంబ పాలన సృష్టించారు." అని అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఎన్‌డీఏ మరింత మెజారిటీతో తిరిగి అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.





Untitled Document
Advertisements