గురుగ్రామ్ లో గోల్ఫ్ కోర్స్ రోడ్లోని మాల్లోని ఒక దుకాణంలో శనివారం ఉదయం మంటలు చెలరేగాయి. అయితే రెండు గంటల్లో మంటలను అదుపులోకి వచ్చినట్లు అధికారులు తెలిపారు. పొగ కారణంగా మాల్లో ముగ్గురు వ్యక్తులు చిక్కుకుపోయారని, అయితే వారిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారని వారు తెలిపారు. "ఉదయం 6 గంటల ప్రాంతంలో మంటల గురించి మాకు సమాచారం అందింది. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉంది. మాల్లోని మొదటి అంతస్తులో ఉన్న షాపుల్లో ఒకదానిలో మాత్రమే మంటలు చెలరేగాయి. అగ్నిప్రమాదానికి గల కారణం ఇంకా తెలియరాలేదు" అని అధికారి లలిత్ కుమార్ తెలిపారు