ఓ మహిళా కానిస్టేబుల్ ప్రమాదవశాత్తూ సీఎం కేసీఆర్ కాన్వాయ్ నుంచి జారిపడి స్వల్ప గాయాలపాలైన ఘటన శనివారం చోటు చేసుకుంది. అప్రమత్తమైన అధికారులు మరో వాహనాన్ని ఆపి ఆమెను జనగాం ఆసుపత్రికి తరలించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమెను జనగాంలోని ఆసుపత్రికి తరలించనున్నట్లు సమాచారం. ప్రతిమ కేన్సర్ ఆస్పత్రిని ప్రారంభించేందుకు సీఎం కేసీఆర్ శనివారం వరంగల్ వచ్చిన సంగతి తెలిసిందే. సీఎం కేసీఆర్కు ఘనస్వాగతం పలికేందుకు మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్యేలు, భద్రతా అధికారులు జనగాంలోని పెంబర్తి కళాతోరణానికి చేరుకున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి.