విజయ్‌ ది నాది ఒక్కటే మనస్తత్వ౦.. రష్మిక

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 04:14 PM

విజయ్‌ ది నాది ఒక్కటే మనస్తత్వ౦.. రష్మిక

‘నేషనల్ క్రష్ ఆఫ్ ఇండియా’గా పేరు తెచుకున్న రష్మిక మందన్న‘పుష్ప’తో ఇండియా అంతట క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రంలో శ్రీ వల్లీగా కనిపించి యూత్‌ను మెస్మరైజ్ చేసింది. తాజాగా ఆమె ‘గుడ్ బై’లో నటించింది. ఈ సినిమా అక్టోబర్ 7న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో రష్మిక ప్రమోషన్స్‌లో పాల్గొంటుంది. అందులో భాగంగా మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక సంగతులను అభిమానులతో పంచకుంది. తన మాజీ బాయ్ ఫ్రెండ్స్‌తో ఇప్పటికి టచ్‌లో ఉన్నానని చెప్పింది. ‘‘నా మాజీ బాయ్ ఫ్రెండ్స్ అందరు కూడా స్నేహితులే. వారి కుటుంబాలను కూడా ఇప్పటికి నేను కలుసుకుంటుటాను. ఇప్పటికి వారి కుటుంబాలతో నాకు చాలా మంచి సంబంధాలు ఉన్నాయి’’అని రష్మిక మందన్న తెలిపింది. అయితే విజయ్‌ దేవరకొండతో కలసి ఆమె గీత గోవిందం , డియర్ కామ్రేడ్ లో నటించింది. దీంతో వీరిద్దరు రిలేషన్‌షిప్ కొనసాగిస్తున్నారని కొంత కాలంగా పుకార్లు షికార్లు కొడుతున్నాయి. ఈ వాదనపైన రష్మిక స్పందించింది. ‘‘మా కెరీర్ ప్రారంభంలో నేను, విజయ్ కలసి అనేక సినిమాలు చేశాం. మా ఇద్దరి మనస్తత్వాలు ఒకే విధంగా ఉండటంతో స్నేహితులుగా మారాం. మా ఇద్దరికి అనేక మంది కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. అందువల్ల ప్రపంచమంతా మా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టింది. వాటిని చూస్తే చాలా క్యూట్‌గా అనిపిస్తుంది’’అని రష్మిక స్పష్టం చేసింది. ఇక రష్మిక మందన్న కెరీర్ విషయానికి వస్తే బాలీవుడ్ సినిమా మిషన్ మజ్ను షూటింగ్‌ను గతంలోనే పూర్తి చేసింది. ఈ చిత్రం త్వరలో విడుదల కానుంది. కోలీవుడ్ హీరో విజయ్ సరసన ‘వారసుడు’లో హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ చిత్రం బై లింగ్విల్‌గా రూపొందుతుంది. సంక్రాంతి పండుగ కానుకగాఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements