విజయవాడ ఎంపీ ప్రచారానికి ముగింపు పలికిన నాగార్జున

     Written by : smtv Desk | Sat, Oct 01, 2022, 04:44 PM

విజయవాడ ఎంపీ ప్రచారానికి ముగింపు పలికిన నాగార్జున

స్టార్ హీరో అక్కినేని నాగార్జున గారు విజయవాడ ఎంపీగా పోటీ చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి తెర పడింది. అయితే ఈ వార్తలను నాగార్జున ఖండించారు. తన రాజకీయ ప్రవేశంపైన వస్తూన వార్తలు నిజం కదాని చెప్పుకోచారు. తాను విజయవాడ ఎంపీగా పోటీ చేస్తానన్న ప్రచారం అవాస్తవమని స్పష్టం చేశారు. 15 ఏళ్లుగా ఇలాంటి ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయని, ఇలాంటివాటిని తాను పట్టించుకోనని అన్నారు. కాగా నాగార్జున ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారంటూ కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. ఆయన సీఎం జగన్‌తో చాలా సన్నిహితంగా ఉంటారు. అక్రమ సంపాదన కేసులో జగన్ జైల్లో ఉన్నప్పుడు నాగార్జున జైలుకు వెళ్లి మరీ పరామర్శించారు. ఆ మద్య సినిమా టికెట్ల తగ్గింపుపై సినీ పెద్దలు ఆందోళన చెందారు. ఒక్క నాగార్జున మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవించారు. జగన్‌తో నాగార్జున సన్నిహితంగా మెలగడంతో అందరూ ఆయన వైసీపీ చేరుతారని అనుకున్నారు. వైసీపీ ఆవిర్భావం నుంచి విజయవాడ ఎంపీ స్థానాన్ని దక్కించుకోలేక పోయింది. అందువల్ల ఈ సారి అక్కడి నుంచి నాగార్జునను నిలబెట్టి విజయం సాధించాలని సీఎం జగన్ భావించారని ప్రచారం చేశారు. కానీ ఇదంత నిజం కాదని నాగార్జున వ్యాఖ్యల ద్వారా స్పష్టమైంది.





Untitled Document
Advertisements