వ్యవసాయ రంగానికి, రైతులకు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి పెద్దపీట వేశారని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. కాగా దసరా సందర్భంగా పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఆరు రోజుల పాటు నిర్వహించే ఒంగోలు జాతి ఎడ్లబళ్ల బల ప్రదర్శన పోటీలను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కారుమూరి గో పూజలు చేశారు. ఈ సందర్భంగా నాలుగు పళ్ల విభాగంలో వెయ్యి కిలోల బండను 15 నిమిషాల వ్యవధిలో లాగే పోటీలను 14 జతల ఎడ్లకు నిర్వహించారు. జడ్పీ ఛైర్మన్ కవురు శ్రీనివాస్, ఎంఎస్ఎంఈ ఛైర్మన్ వంక రవీంద్రనాథ్, శెట్టిబలిజ కార్పొరేషన్ ఛైర్మన్ గుబ్బల తమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ జి.సృజన, తణుకు, ఇరగవరం, అత్తిలి ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, వైకాపా నాయకులు పాల్గొన్నారు.