ఉద్యోగుల వయో పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం..

     Written by : smtv Desk | Sun, Oct 02, 2022, 12:44 AM

ఉద్యోగుల వయో పరిమితిని పెంచిన ఏపీ ప్రభుత్వం..

ఏపీ సర్కార్ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగాల భర్తీ క్యాలెండర్లకు ముందు ప్రభుత్వ ఉద్యోగుల వయో పరిమితి పెంచుతూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.కాగా 34 ఏళ్ల నుంచి 42 ఏళ్లకు పొడిగించింది. అయితే, వచ్చే ఏడాది సెప్టెంబర్ వరకు మాత్రమే ఈ నిబంధన అమలులో ఉండనుందని అధికారులు తెలిపారు. అదేవిధంగా గ్రూప్ -1 లో ఇంటర్య్వూలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు గతంలో రద్దు చేసిన ఇంటర్వ్యూ విధానాన్ని పునరుద్ధరిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్ -1లో అత్యున్నత స్థాయి ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.





Untitled Document
Advertisements