ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రశంసలతో ముంచెత్తారు. శనివారం రాత్రి కరీంనగర్లో నిర్వహించిన కళోత్సవాల్లో పాల్గొన్న ఆయన మంత్రి గంగుల కమలాకర్తో కలిసి జానపద కళాకారులను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కళాకారులను సన్మానించారు. కళాకారుల ఆటపాటలను వీక్షించారు. ఈ సందర్భంగా ప్రకాశ్రాజ్ మాట్లాడుతూ కేసీఆర్పై ప్రశంసల జల్లు కురిపించారు. ఆయన విజన్ ఉన్న గొప్ప నాయకుడని కొనియాడారు. రాష్ట్రంపై ఆయనకు ఎంతో ప్రేమ ఉందన్నారు. ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టకుండా అందరి హక్కుల కోసం పోరాడుతున్న గొప్ప నాయకుడని అన్నారు. అలాంటి నాయకుడు దొరకడం ప్రజల అదృష్టమని అన్నారు. మతోన్మాదులు రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దారని ప్రశంసించారు. కార్యక్రమం సందర్భంగా ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ తెలంగాణ కళాకారుల ప్రతిభ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోందని అన్నారు. గతంలో తెలంగాణ భాషను, యాసను సినిమాల్లో హాస్యానికి వాడేవారని, కానీ ఇప్పుడు తెలంగాణ భాష గొప్పతనం గురించి అందరికీ తెలుస్తోందని ప్రకాశ్ రాజ్ అన్నారు.