టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ప్రయాణిస్తున్న కారును ఆటో ఢీకొనడంతో స్వల్ప గాయాలయ్యాయి. పెద్దపల్లి జిల్లాలో శనివారం రాత్రి జరిగిన ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, ఎండీ సజ్జనార్ మహారాష్ట్రకు వెళ్తుండగా ధర్మారం చౌరస్తా వద్ద రామగుండం వైపు వెళ్తున్న ఆటో ఎండీ కారును ఢీకొట్టింది. రామగుండం మండలం మల్యాలపల్లికి చెందిన ఆటో ప్రయాణికులు నాగరాజు, లక్ష్మిలకు తీవ్రగాయాలు కాగా, అంతర్గావ్ మండలం రాయబండికి చెందిన నూనె భూమయ్య, లక్ష్మిలకు స్వల్ప గాయాలయ్యాయి. వారిని పెద్దపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కరీంనగర్కు తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఎండి సజ్జనార్ తన ప్రయాణాన్ని కొనసాగించారు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటం వల్లే ఈ ప్రమాదం జరిగింది.